ఈ డిజిటల్ ప్రపంచం పేరెంట్స్ కష్టాలను మరింత పెంచేసింది. ఈ రోజుల్లో పిల్లలు గంటల తరబడి టీవీల ముందు, ఫోన్ స్కీన్ ముందు అతుక్కుపోతున్నారు. పేరెంట్స్ రెస్ట్రిక్ట్ చేస్తే.. ఏడ్చైనా, అరిచైనా పంతాన్ని నెగ్గించుకుంటున్నారు. పిల్లలు ఫోన్లకు ఎడిక్ట్ అయిపోవడం చూసి వాళ్ళను ఎలా మార్చాలో అని తలలు పట్టుకుంటున్నారు తల్లిదండ్రులు. పిల్లలు డిజిటల్ స్ట్రీన్లకు అతుక్కునిపోవడం ఇప్పుడు తల్లిదండ్రులకు అత్యంత ఆందోళన కలిగించే విషయం. డిజిటల్ ప్లాట్ఫారమ్లో ఏమి చూస్తున్నారో? వారి ప్రవర్తన ఎలా ఎఫెక్ట్ అవుతుంది? పిల్లల ఆరోగ్యం ఏమవుతుంది? అనే బాధతో పేరెంట్స్ సతమతమవుతున్నారు. దీనిపై ఈ మధ్యనే సోషియో – ఎమోషనల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ MyPeegu ఒక సర్వే నిర్వహించింది. దీనిలో 61 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లల స్క్రీన్ టైమ్ గురించి టెన్షన్ పడుతున్నట్లు గుర్తించారు. పిల్లల అభివృద్ధికి సమతుల్య ఆహారం ఎంత అవసరమో, బ్యాలెన్స్డ్ స్క్రీన్ టైమ్ కూడా అంతే అవసరమని అంటున్నారు నిపుణులు.
పూర్తిగా చదవండి..Screen time:డిజిటల్ ప్రపంచానికి దూరంగా పిల్లలను పెంచడం ఎలా?
పిల్లలు పెంపకం....ఇదో అంతులేని సబ్జెక్ట్. దీని గురించి ఎవరు ఎంత చెప్పినా తక్కువే, ఎంత మాట్లాడినా తక్కువే. ప్రతీ పిల్లా, పిల్లాడికి తేడాలు ఉన్నట్లే ప్రతీ తల్లిదండ్రుల పెపంకంలోనూ తేడా ఉంటుంది. పిల్లలు ఇంతకు మునుపులా లేరు. జనరేషన్స్ మారుతున్న కొద్దీ పిల్లల తెలివితేటల్లో మార్పులు వస్తున్నాయి. 80, 90 లలో పిల్లలు అమ్మానాన్న ఎలా చెబితే అలా వినేవారు. తిరిగి ప్రశ్నించడం చాలా అరుదుగానే ఉండేది. కానీ తర్వాత తరం మాత్రం ప్రశ్నించడమే జన్మహక్కుగా ఉంటున్నారు. ముఖ్యంగా ప్రపంచం డిజిటలైజ్ అయిపోవడంతో దానికి పిల్లలు అడిక్ట్ అయిపోతున్నారు. దీని నుంచి వారిని ఎలా కాపాడాలన్నదే ఇప్పుడు పేరెంట్స్ ముఖ్య సమస్య.
Translate this News: