దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గాష్టమి సందర్భంగా పల్లెల నుంచి మహానగరాల దాకా సందడి వాతావరణం నెలకొంది. అయితే వివిధ ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా.. ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో చేసిన ఓ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గొండాలో ఆడబిడ్డల ఆరాధన మహోత్సవం ‘శక్తివందనం’ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో 11,888 మంది బాలికలకు పూజలు చేసి, కన్యా భోజనం ఏర్పాటు చేశారు. షాహీద్-ఎ-ఆజం సర్దార్ భగత్ సింగ్ ఇంటర్ కళాశాల ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం ఈ వేడుకలను నిర్వహించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ నేహా శర్మ తెలిపారు.
పూర్తిగా చదవండి..అమ్మో.. ఆ రాష్ట్రంలో 11,888 బాలికలకు కన్య పూజలు
ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో ఆడబిడ్డల ఆరాధన మహోత్సవం 'శక్తివందనం' కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో 11,888 మంది బాలికలకు పూజలు చేసి, కన్యా భోజనం ఏర్పాటు చేశారు. షాహీద్-ఎ-ఆజం సర్దార్ భగత్ సింగ్ ఇంటర్ కళాశాల ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం ఈ వేడుకలను నిర్వహించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ నేహా శర్మ తెలిపారు.
Translate this News: