ఇటీవల కాంగ్రెస్ ఎంపీ శశీథరూర్.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాతో కలిసి పార్టీలో దిగినటువంటి ఫోటోలు ఆన్లైన్లో చక్కర్లు కొట్టాయి. అయితే దీనిపై స్పందించిన శశీథరూర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఫోటోలను వైరల్ చేయడంపై మండిపడ్డారు. ఇవి నీచపు రాజకీయాలంటూ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన కేరళలోని కొట్టాయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇవి దిగజారుడు రాజకీయాలు. అందులో కనిపిస్తున్న ఫోటోలు ఆమె పుట్టినరోజు వేడుకలో దిగినవి. ఆమె నా కంటికి చిన్న పిల్లలా కనిపిస్తుంది. అంతేకాదు ఆమె నా కంటే 18 నుంచి 20 ఏళ్లు చిన్నదని.. ఈ పుట్టినరోజు వేడుకల్లో 15 మంది వరకు పాల్గొన్నారని శశిథరూర్ అన్నారు. అలాగే అక్కడ తన సోదరి కూడా ఉందని తెలిపారు. కానీ కొంతమంది వ్యక్తులు కావాలనే దురుద్దేశంతో పార్టీకి వచ్చిన మిగతావారందరిని తొలగించి.. అది కేవలం ఓ వ్యక్తిగత సమావేశంగా ఉన్నట్లు ఫోటోలను వక్రీకరించారని తెలిపారు.
పూర్తిగా చదవండి..Shashi Tharoor: ఇద్దరి ఫొటోలు లీక్.. స్పందించిన శశిథరూర్
కాంగ్రెస్ ఎంపీ శశీథరూర్.. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాతో కలిసి దిగిన ఫోటోలు ఇటీవల వైరల్ అయ్యాయి. అయితే దీనిపై స్పందించిన ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆ ఫోటోలు ఓ పుట్టినరోజు వేడుకలో దిగినవంటూ తెలిపారు. కొందరు కావాలనే దురుద్దేశపూర్వకంగా ఆ ఫోటోలను ఎడిట్ చేశారంటూ పేర్కొన్నారు. ఇవి నీచపు రాజకీయాలంటూ ధ్వజమెత్తారు. పార్టీకి వచ్చిన మిగతావారందరిని తొలగించి.. కేవలం వ్యక్తిగతంగా ఉన్నట్లు ఫోటోలను వక్రీకరించారంటూ క్లారిటీ ఇచ్చారు.
Translate this News: