కాళేశ్వరం ప్రాజెక్ట్ పై శ్వేత పత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatala Rajendar) డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఇంతకు ముందు కట్టిన ప్రాజెక్ట్ లు ఏమీ దెబ్బ తినలేదన్నారు. కానీ కేసీఆర్ (KCR) ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం మూడు ప్రాజెక్ట్ లు దెబ్బతిన్నాయని ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టుల కోసం సెలక్ట్ చేసిన సైట్ కరెక్ట్ కాదన్నారు. సాయిల్ టెస్ట్ కూడా సరిగా చేయలేదని ఆరోపించారు. ప్రాజెక్ట్ ను రికార్డ్ కోసం నిర్మించి, గొప్పలు చెప్పుకున్నారని మండిపడ్డారు. లక్ష్మి బ్యారేజ్ ను ఇసుక మీద కట్టారన్నారు. అన్ని పిల్లర్ లను చెక్ చేస్తే తప్పా.. ప్రాజెక్ట్ ఉంటుందా? లేదా? అనేది తేలుతుందన్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నీళ్లు వదలడంతో మోటర్లన్నీ కొట్టుకుపోయాయన్నారు. గొర్లు, బర్లు కూడా కొట్టుకు పోయాయన్నారు.
ఇది కూడా చదవండి: కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ క్వాలిటీ మీద లేదు..కేటీఆర్ ది బిచ్చపు బతుకు..!!
Eatala Rajendar: కాళేశ్వరంతో లక్ష కోట్లు గంగ పాలు.. కేసీఆరే కారణం: ఈటల తూటాలు
కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ను గొప్పల కోసం నిర్మించి లక్ష కోట్లు గంగ పాలు చేశాడని బీజేపీ నేత ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. కనీసం సాయిల్ టెస్ట్ కూడా సరిగా చేయలేదని తీవ్ర ఆరోపణలు చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు ఘటనకు బాధ్యత వహించి సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని ఈటల డిమాండ్ చేశారు
Translate this News: