కాళేశ్వరం ప్రాజెక్టులోకి ముఖ్య భాగమైన మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్ (Medigadda) పిల్లర్లు కుంగడంతో ఆందోళన వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) డ్యామ్ భద్రతపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్కు లేఖ రాశారు. బ్యారేజీ భద్రతను పరీక్షించేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని లేఖలో కోరారు. కిషన్ రెడ్డి లేఖకు స్పందించిన కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కేంద్ర బృందాన్ని పంపాలని నిర్ణయించారు. కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో ఆయన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ బృందం ఈరోజు తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం కానుంది.
ఇది కూడా చదవండి: Medigadda Barrage Updates: మేడిగడ్డ కూలిపోతుందా?.. అసలేం జరుగుతోందంటే?
Medigadda: కిషన్ రెడ్డి లేఖతో రంగంలోకి కేంద్రం.. రేపు మేడిగడ్డకు స్పెషల్ టీమ్!
కిషన్ రెడ్డి లేఖతో మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్ (Medigadda) పిల్లర్లు కుంగిన ఘటనపై కేంద్రం రంగంలోకి దిగింది. కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఈ రోజు రాష్ట్ర నీటిపారుదల అధికారులతో సమావేశం కానుంది. రేపు బ్యారేజ్ ను సందర్శించనుంది.
Translate this News: