తెలంగాణ ఎన్నికలకు (Telangana Elections 2023) సంబంధించి మొత్తం 52 మంది అభ్యర్థులతో బీజేపీ (Telangana BJP) నిన్న ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది రాజీనామా వరకు వెళ్తున్నారు. తాజాగా నిర్మల్ జిల్లాలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి పార్టీకి రాజీనామా చేసింది. ముథోల్ టికెట్ ను తనకు కాదని రామారావు పటేల్ కు కేటాయించడంపై రమాదేవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మీడియా ముందు కన్నీరు పెట్టుకుంది. పార్టీ కోసం తాను తిరిగిన సమయంలో నవ్విన వారికి టికెట్ ఎలా కేటాయిస్తారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: Vivek Venkataswamy: ఆఖరి నిమిషంలో లిస్ట్ నుంచి వివేక్ పేరు ఔట్.. ఆయన దారెటు?
TS BJP: నాకు బీజేపీ అన్యాయం చేసింది.. మహిళా నేత కన్నీరు.. పార్టీకి రాజీనామా!
బీజేపీకి నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రామాదేవి పార్టీకి రాజీనామా చేశారు. ఇన్నాళ్లూ కష్టపడి పని చేసిన తనకు టికెట్ ఇవ్వకుండా పార్టీ అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానన్నారు.
Translate this News: