తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రాచలం ఆలయ భూముల్లో గోశాల నిర్మాణ పనులు చేపడుతుండగా.. ఆంధ్రప్రదేశ్కు చెందిన పురుషోత్తపట్నం గ్రామస్థులు అడ్డుకున్నారు. దేవాలయం భూములు తమవేనంటూ ఆందోళన చేశారు. దీంతో భద్రాచలం ఆలయ సిబ్బంది, గ్రామస్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తోపులాట చోటుచేసుకుంది. ఆలయ ఈవో రమాదేవితో కూడా గ్రామస్థులు వాగ్వాదానికి దిగారు. సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గోశాల నిర్మాణ పనులకు సహకరించాలని.. ఏపీ రెవెన్యూ అధికారుల్ని భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి కోరుతున్నప్పటికీ.. ఇందుకు ఏపీ రెవెన్యూ అధికారులు సహకరించడం లేదు. భద్రాచలం ఆలయ సిబ్బంది ఆందోళనకు దిగడంతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పూర్తిగా చదవండి..TS-AP Border: ఆలయ భూముల్లో వివాదం.. తెలంగాణ, ఏపీ బార్డర్ లో తీవ్ర ఉద్రిక్తత..
తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రాచలం ఆలయ భూముల్లో గోశాల నిర్మాణ పనులు చేపడుతుండగా.. ఆంధ్రప్రదేశ్కు చెందిన పురుషోత్తపట్నం గ్రామస్థులు అడ్డుకున్నారు. దేవాలయం భూములు తమవేనంటూ ఆందోళన చేశారు. దీంతో భద్రాచలం ఆలయ సిబ్బంది, గ్రామస్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. గోశాల నిర్మాణ పనులకు సహకరించాలని.. ఏపీ రెవెన్యూ అధికారుల్ని భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి కోరుతున్నప్పటికీ.. ఇందుకు ఏపీ రెవెన్యూ అధికారులు సహకరించడం లేదు.
Translate this News: