కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ (Medigadda Barrage) ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. 20వ పిల్లర్ బేస్మెంట్ దెబ్బతిన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 3వ బ్లాక్ అంతకంతకూ డ్యామేజ్ అవుతోందని సమాచారం. సాయంత్రంలోపు కూలిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఘటనాస్థలిని ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు. ఈ నేపథ్యంలో పరిస్థితిపై ఉన్నతాధికారులు అత్యవసర సమీక్ష నిర్వహించారు. అయితే.. అధికారులు మాత్రం ఈ ఘటనపై ఇంతవరకు స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర పోలీసుల ఆంక్షలు విధించారు. ప్రతిపక్షాలు, మీడియాను అనుమతించడం లేదు.
ఇది కూడా చదవండి: TS Elections 2023: తెలంగాణలో ఆ పార్టీదే గెలుపు.. మిషన్ చాణక్య సంచలన సర్వే.. వివరాలివే!
Medigadda Barrage Updates: మేడిగడ్డ కూలిపోతుందా?.. అసలేం జరుగుతోందంటే?
మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు, మీడియాను బ్యారేజ్ వద్దకు అనుమతించడం లేదు. 19, 20 పిల్లర్ల సబ్ స్ట్రక్చర్ రెండుగా చీలిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. మరో వైపు అధికారులు ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
Translate this News: