Undavalli Arun Kumar RTV Uncensored Interview: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై(Chandrababu) నమోదైన కేసులపై విచారణను సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్(Arun Kumar) వేసిన పిటిషన్ ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీవీ అన్ సెన్సార్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుపై నమోదైన కేసులపై, ఏపీలో ప్రస్తుత రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు. తాను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదన్నారు. అదే సమయంలో తాను ఎన్నికల రాజకీయాలకు మాత్రమే దూరమయ్యానని, రాజకీయాలకు మాత్రం దూరం కాలేదని క్లారిటీ ఇచ్చారు. ఇక తాను చంద్రబాబుపై నమోదైన కేసుల అంశంలో హైకోర్టును ఆశ్రయించడంపైనా క్లారిటీ ఇచ్చారు. కేసును చూడగానే.. టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు, ప్రభుత్వం నమోదు చేసిన కేసులను పరిశీలించిన తరువాత.. సీఐడీ కంటే.. సీబీఐతో విచారణ జరిగితే బాగుంటుందని అనిపించిందన్నారు. అందుకే సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశానని చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్. అయితే, ఈ పిటిషన్ వేయడం వెనుక ఎవరి ప్రోత్బలం లేదన్నారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: ఇలా చేస్తే చంద్రబాబుకు ఈజీగా బెయిల్ వచ్చేది.. ఉండవల్లి అరుణ్ సంచలన కామెంట్స్..
చంద్రబాబు కేసులకు సంబంధించి ఏపీలో వివాదాలు నడుస్తున్న నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఆర్టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో చంద్రబాబుపై నమోదైన కేసులు.. ఆ కేసుల్లో జరుగుతున్న విచారణ.. సీఐడీ అధికారుల తీరు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, చంద్రబాబు అరెస్ట్తో ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు సహా అనేక కీలక అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు బెయిల్ విషయంలో లాయర్లు చిన్న లాజిక్ మిస్ అయ్యారని చెప్పారు. కేసులో పారదర్శకమైన విచారణ కోసమే సీబీఐ ఎంక్వైరీ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశానన్నారు.
Translate this News: