హమాస్ మొదలుపెట్టిన మారణకాండను ఇజ్రాయెల్ కొనసాగిస్తోంది. తమ దేశంలో హమాస్ సృష్టించిన విధ్వంసానికి ప్రతీకారంగా, వారి చేతుల్లో తమ బందీలను విడిపించుకునే దిశగా ఇజ్రాయెల్ వరుసపెట్టి గాజాలో దాడులు చేస్తోంది. మరోవైపు హమాస్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నా లెక్క చేయడం లేదు. తన వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయిల్ పౌరులను విడిచిపెట్టడం లేదు. కానీ ఈ రెండింటి మధ్య జరుగుతున్న యుద్ధంలో అమాయక, సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు. ఇజ్రాయెల్ చేస్తున్న బాంబు దాడిలో హమాస్ మిలిటెంట్లు ఎంత మంది చనిపోతున్నారో తెలియదు కానీ.. గాజాలో ఉంటున్న వందలాది మంది సామాన్య ప్రజలు మాత్రం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా అబంశుభం తెలియని చిన్నారులు లోకాన్ని ఇంకా పూర్తిగా చూడకముందే కళ్ళు మూస్తున్నారు.
పూర్తిగా చదవండి..Israel-Hamas conflict:చిన్నారులను చిదిమేస్తున్న యుద్ధం – హృదయ విదారకంగా గాజా
యుద్ధాలు ఎప్పుడూ మానవ మనుగడకు ప్రమాదమే. ఇవి మనుషులకు ఎప్పుడూ శాంతిని ఇవ్వలేవు. యుద్ధం అయిపోయాక భవిష్యత్తులో చరిత్ర పాఠాలుగా చదువుకోవచ్చునేమో కానీ అది జరుగుతున్నప్పుడు మాత్రం అన్నిరకాలుగా నష్టమే తప్ప ఒరిగేదేమీ ఉండదు. ఇందుకు నిదర్శనమే ఇజ్రాయెల్-హమాస్ల మధ్య వార్.
Translate this News: