National Police Memorial Day: వారి పేరు వింటేనే క్రిమినల్స్ వెన్నులో వణుకు పుడుతుంది.. వారి పేరు వింటేనే సామాన్య ప్రజల్లో ధైర్యం వస్తోంది.. వారి కారణంగానే ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా నిద్రపోగలగుతున్నారు.. వారే పోలీసులు. రక్షక భటులుగా.. మనల్ని నిరంతరం రక్షిస్తున్నారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. అసాంఘీక శక్తులు ప్రబలకుండా.. అవసరమైన చర్యలు చేపడుతూ శాంతి భద్రతలను పరిరక్షిస్తున్నారు. ప్రజల ప్రాణాలు రక్షించే క్రమంలో.. క్రిమినల్స్ను పట్టుకునే క్రమంలో దేశ వ్యాప్తంగా ఎంతోమంది పోలీసులు అసువులుబాసారు. వారి త్యాగనిరతిని, వారి ధైర్యసాహసాలను గుర్తిస్తూ.. అక్టోబర్ 21న దేశ వ్యాప్తంగా పోలీసు అమరవీరుల దినోత్సవం (National Police Memorial Day) నిర్వహిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.
పూర్తిగా చదవండి..National Police Memorial Day: దేశ వ్యాప్తంగా ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం..
దేశ వ్యాప్తంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. అమరవీరులను స్మరించుకుంటూ.. వారికి నివాళులు అర్పిస్తూ దేశ వ్యాప్తంగా పోలీసులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహిస్తూ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని నేషనల్ పోలీస్ మెమోరియల్ వద్ద జరిగిన జాతీయ పోలీస్ స్మారక దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. పోలీసుల అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు.
Translate this News: