ఇజ్రాయెల్, హమాస్ల మధ్య వార్ రోజు రోజుకూ ఎక్కువ అవుతోంది. ఇరు దేశాలు మొడిపట్టుదల పట్టుకుని కూర్చున్నాయి. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ గాజాలో భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. దీని వలన వేలమంది పాలస్తీనియన్లు చనిపోతున్నారు, గాయాలపాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆ దేశానికి కీలక సూచనలు చేశారు. 9/11 తర్వాత అమెరికా చేసిన తప్పుల నుంచి ఇజ్రాయెల్ నేర్చుకోవాలని ఆయన సూచించారు. తాను ఇజ్రాయెల్లో పర్యటించినప్పుడు 9/11 ఘటన వలన అమెరికా అనుభవించిన నరకాన్ని చెప్పానని అన్నారు. అప్పడు న్యాయం కోసమని చెప్పి చాలా తప్పులు చేశామని…ఆవేశంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుపోయి అడుగులు వేయొద్దని బైడెన్ ఇజ్రాయెల్ను హెచ్చరించారు. ఏం చేసినా బాగా ఆలోచించి అడుగులు వేయాలని విజ్ఞప్తి చేశారు.
పూర్తిగా చదవండి..Joe Biden:మేం చేసిన తప్పు మీరు చేయోద్దు- ఇజ్రాయెల్ను హెచ్చరించిన బైడెన్
9/11 తర్వాత మేము చేసిన తప్పునే మీరూ చేయొద్దు అంటూ అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ను హెచ్చరించారు. హమాస్ను ఎదుర్కొనేందుకు కళ్ళు మూసుకుపోయి తప్పులు చేయొద్దని చెప్పారు. ఇజ్రాయెల్, హమాస్ల మధ్య యుద్ధం ముదురుతున్న వేళ బైడెన్ హెచ్చరికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Translate this News: