చంద్రబాబు ఫైబర్ నెట్, స్కిల్ స్కామ్ రెండు కేసుల విచారణనూ సుప్రీంకోర్టు వచ్చే నెల 8కి వాయిదా వేసింది. ఫైబర్ నెట్ కేసులో విచారణ జరగాల్సి ఉండగా…స్కిల్ స్కామ్ లో వేసిన క్వాష్ పిటిషన్ మీద విచారణ ముగిసి.. తీర్పు ఇవ్వాల్సి ఉంది. మరోవైపు జైల్లో చంద్రబాబు ములాఖత్ ఒకరోజుకు కుదించడం మీద ఆయన తరుపు న్యాయవాదులు వేసిన పిటిషన్ ఏసీబీ కోన్టు కొట్టేసింది. ప్రతివాదులు లేనందను విచారణ చేయలేమని చెప్పింది. దాంతో పాటూ సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డ్ పిటిషన్ ను 26వ తేదీకి వాయిదా వేసింది. చంద్రబాబు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీ పీపీని ఏసీబీ కోర్టు ఆదేశించింది. దీనికి ఈనెల 26 వరకు సమయం కావాలని పీపీ అడిగింది. దీంతో ఈ కేసు విచారణను
26వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
Supreme court: చంద్రబాబు కేసులను వచ్చే నెల 8కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ములాఖత్ ను పెంచాలని చంద్రబాబు వేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ప్రతివాదుల పేర్లు చేర్చకపోవడంతో ఇప్పుడు విచారణ అవసరం లేదని పిటీషన్ ఏసీబీ కోర్టు జడ్జి చెప్పారు. దాంతో పాటూ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్ర బాబు వేసిన క్వాష్ పిటిషన్ తీర్పు వచ్చే నెల అంటే నవంబర్ 8కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అలాగే ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు నవంబరు 9 న వింటామని ధర్మాసనం చెప్పింది.
Translate this News: