స్కిల్ డవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జ్యుడీషియల్ రిమాండ్ ను (Chandrababu Naidu’s judicial remand) విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court) మరోసారి పొడిగించింది. నవంబర్ ఒకటి వరకు రిమాండ్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబును వర్చువల్ గా జడ్జి ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. ఈ సందర్భంగా జడ్జి చంద్రబాబుతో మాట్లాడారు. తన సెక్యూరిటీ విషయంలో కొన్ని అనుమానాలున్నాయని చంద్రబాబు ఈ సందర్భంగా జడ్జికి తెలిపారు. ఏమైనా అనుమానాలుంటే రాతపర్వకంగా ఇవ్వాలని జడ్జి సూచించారు.
ఇది కూడా చదవండి: Chandrababu:ఇన్నర్ రింగ్ కేసు బెయిల్ పిటిషన్ విచారణ వచ్చేనెల 7కు వాయిదా
Big Breaking: చంద్రబాబు రిమాండ్ పొడిగింపు..
చంద్రబాబు రిమాండ్ ను విజయవాడ ఏసీబీ కోర్టు నవంబర్ 1వ తేదీ వరకు పొడిగించింది. ఇదిలా ఉంటే.. ఇదే కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
Translate this News: