ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. ఇప్పటికే ఇన్నర్ రింగ్ కేసులో 500 పేజీల కౌంటర్ దాఖలు చేసింది సీఐడీ. ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ మార్చడం ద్వారా చంద్రబాబు కుటుంబ సభ్యులు, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేష్ లకు లబ్ది చేకూర్చారని కౌంటర్ లో పేర్కొంది సీఐడీ. మరోవైపు.. లేని ఇన్నర్ రింగ్ రోడ్ పై కేసు నమోదు చేసిందని ఆరోపిస్తున్నారు చంద్రబాబు తరపు అడ్వకేట్లు. దీని మీద ఇవాళ కూడా వాదనలు జరిగాయి. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 7వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. మరోవైపు CDR పిటిషన్ను కరెక్షన్ చేసి తీసుకురావాలని చంద్రబాబు తరపు న్యాయవాదులకు ఎసిబి కోర్టు సూచించింది.
లీగల్ ప్రొవిజన్ ప్రకారం పిటీషన్ లోని అంశాలను ప్రస్తావించాలని చెప్పింది. మధ్యాహ్నం తరువాత CDR పై ఎసీబి కోర్టు వాదనలు విననుంది.
Chandrababu:ఇన్నర్ రింగ్ కేసు బెయిల్ పిటిషన్ విచారణ వచ్చేనెల 7కు వాయిదా
ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను వచ్చేనెల 7వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఈరోజు చంద్రబాబుతో ములాఖత్ కోసం లోకేష్ ఢిల్లీ నుంచి రానున్నారు.
Translate this News: