Madhya Pradesh: మనుషుల్లో మానవత్వం రోజు రోజుకు నశించిపోతోంది. తాజాగా అబంశుభం తెలియని చిన్నారిని ఓ మహిళ గొంతు పిసికి చంపేసింది. ఆ చిన్నారి ఏడవటమే.. ఈ దారుణానికి కారణమట. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని(Madhyapradesh) జబల్పూర్లో(Jabalpur) చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఓసారి తెలుసుకుందాం.. జబల్ పూర్లో దారుణం జరిగింది. పదే పదే ఏడుస్తూ తన నిద్రను పాడు చేస్తోందని ఆగ్రహంతో రెండేళ్ల చిన్నారిని గొంతు నులిమి చంపేసింది పిన్ని. పిన్ని అంటే ఆ చిన్నారికి ఇష్టం. ఆ ఇష్టంతోనే.. అమ్మను సైతం కాదని పిన్ని వద్దకు పడుకుంది. అయితే, ఆ అహిళ తనకు నిద్ర వస్తుందని, చిన్నారిని తన తల్లి వద్దకు వెళ్లాలని చెప్పింది. చిన్నారి వినకుండా అక్కడే ఉండటంతో చెంపమీద కొట్టింది. దాంతో చిన్నారి గుక్కపట్టి ఏడ్చింది. మరింత ఆగ్రహించిన మహిళ.. చిన్నారిని గొంతు పిసికి చంపేసింది. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు.. చిన్నారి మృతదేహాన్ని సోఫా కింద దాచి పెట్టింది.
పూర్తిగా చదవండి..మనిషి కాదు రాక్షసి.. ఏడుస్తోందని చిన్నారిని చిదిమేసింది.. ఎక్కడ జరిగిందంటే..
జబల్ పూర్లో దారుణం జరిగింది. పదే పదే ఏడుస్తూ తన నిద్రను పాడు చేస్తోందని ఆగ్రహంతో రెండేళ్ల చిన్నారిని గొంతు నులిమి చంపేసింది పిన్ని.
Translate this News: