ప్రస్తుతం క్రికెట్ మూడు ఫార్మాట్లలో అవుతోంది. ఒకప్పుడు కేవలం టెస్ట్ ఫార్మాట్లో మాత్రమే క్రికెట్ ఉండేది. కానీ ఆ తర్వాత కాలంలో వన్డే ఫార్మాట్ అందుబాటులోకి వచ్చింది. దాని తర్వాత పొట్టి ఫార్మాట్ అనే టి20 ఫార్మాట్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే టెస్ట్ ఫార్మాట్ వన్డే ఫార్మాట్ కి రానంత క్రేజ్ టి20 ఫార్మాట్ కి మాత్రం అతి తక్కువ సమయంలోనే వచ్చేసింది. ఇందులో మ్యాచ్ ఫలితం కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు.. గంటల తరబడి టీవీలకు అతుక్కు పోవాల్సిన పనిలేదు. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఎవరు విజేత అన్న విషయం తేలిపోతూ ఉంటుంది. అంతేకాదు ఇందులో మ్యాజిక్లు కూడా ఎక్కువగానే జరగుతూ ఉంటాయి. క్రికెట్ లవర్స్ కు కావల్సిన వినోదం అంతా ఫుల్ గా వచ్చేస్తుంది. దీంతో ఇక టి20 ఫార్మాట్ క్రేజ్ అంతకంతకు పెరిగిపోయింది. అందులోనూ ఐపీఎల్ లాంటివి రావడం, అన్ని దేశాల క్రికెటర్లు కలిపి ఆడడంతో పొట్టి ఫార్మాట్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
పూర్తిగా చదవండి..World Cup: వరల్డ్కప్ ను పెద్దగా పట్టించుకోని జనాలు..కారణం ఇదేనా?
వన్డే క్రికెట్ వరల్డ్కప్కు క్రేజీ తగ్గిందా? ఇంతకు ముందు ఉన్నంత హడావుడి ఇప్పుడు లేదా? క్రికెట్ నుచూసే జనాలు తక్కువ అవుతున్నారా...లేక వన్డే ఫ్మార్మాట్ ను చూడ్డానికి ఇష్టపడ్డం లేదా. ప్రస్తుం భారత్లో వన్డే ప్రపంచకప్ టోర్నీ జరుగుతోంది. మామూలుగా వరల్డ్కప్ అంటే ఎక్కడ లేని మోజు ఉంటుంది. అందులోనూ క్రికెట్ ను మతంగా భావించే ఇండియాలో అయితే మరీను. కానీ ఈ సారి పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా ఉంది. ఎక్కడా అసలు హడావుడే లేదు. మొన్న జరిగిన భారత్, పాక్ మ్యాచ్కి కూడా జనాలు అస్సలు స్పందించలేదు. కోట్లమంది జనాభా ఉన్న దేశంలో వ్యూస్ కేవలం లక్షల్లో ఉంది అంటేనే అర్ధమవుతుంది వరల్డ్కప్ ఎంత చప్పగా సాగుతోందో.
Translate this News: