Hyderabad Salon Incident: కూకట్పల్లి (Kukatpally) పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపారాయుడునగర్లో దారుణ హత్య చోటుచేసుకుంది. హర్ష లుక్స్ సెలూన్ యజమాని అశోక్ (Ashok) ని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. సెలూన్లోని సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేసి దుండగులు పరారయ్యారు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో అశోక్ సెల్ ఫోన్కి కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. అయితే.. అతను లిఫ్ట్ చేయకపోవడంతో సెలూన్ దగ్గరికి అతని భార్య, కుమారులు వెళ్లారు. సెలూన్ షట్టర్పైకి లేపి చేడగానే అశోక్ విగతజీవిగా పడి ఉన్నాడు. అది చూసి షాక్కు గురైన అతడి భార్య వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్లూస్ టీమ్, కూకట్పల్లి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి ఘటనపై ఆరా తీశారు
పూర్తిగా చదవండి..Hyderabad Crime: కూకట్పల్లి సెలూన్ షాప్ లో మర్డర్.. ఆ గ్యాంగ్ పనేనా?
కూకట్పల్లి పీఎస్ పరిధిలోని పాపారాయుడునగర్లో దారుణ హత్య చోటుచేసుకుంది. హర్ష లుక్స్ సెలూన్ యజమాని అశోక్ని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. సెలూన్లోని సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేసి దుండగులు పరారయ్యారు. ఈ హత్య బీహార్ గ్యాంగ్ పనేనంటూ నాయీ బ్రాహ్మణ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
Translate this News: