రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే 55 మంది అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ (T-Congress First List) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అనేక మంది కాంగ్రెస్ సీనియర్లకు చోటు లభించలేదు. నాగర్ కర్నూల్ టికెట్ ను నాగం జనార్ధన్ రెడ్డికి (Nagam Jandradhan Reddy) ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. ఆ సీటును కూచుకుళ్ల రాజేశ్ రెడ్డికి ఇచ్చారు. సూర్యాపేటలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డికి మధ్య టికెట్ కోసం తీవ్ర పోటీ ఉంది. ఆ సీటును కూడా ఇప్పుడు ప్రకటించలేదు. దీంతో ఆ టికెట్ పటేల్ రమేశ్ రెడ్డికి ఖాయమైనట్లు తెలుస్తోంది. ఇంకా ఖమ్మం జిల్లా సత్తుపల్లి టికెట్ కోసం మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదే టికెట్ కోసం ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నేత మానవతారాయ్ కూడా పోటీలో ఉన్నారు. ఈ టికెట్ ను కూడా ప్రస్తుతానికి ప్రకటించలేదు.
ఇది కూడా చదవండి: T-Congress First List: కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ లో 11 మంది బీసీలు.. లిస్ట్ ఇదే!
T-Congress First List: నాగంతో పాటు ఆ మాజీ మంత్రులకు కాంగ్రెస్ షాక్.. టికెట్ దక్కని కీలక నేతలు వీరే!
55 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన కాంగ్రెస్ హైకమాండ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి, గీతారెడ్డి తదితర మాజీ మంత్రుల పేర్లను ప్రకటించలేదు. ఇంకా కొండా సురేఖ, మధు యాష్కిల పేర్లు కూడా ఫస్ట్ లిస్ట్ లో లేవు.
Translate this News: