Union Minister Kishan Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రధాని మోదీ(PM Modi) వస్తే.. పిచ్చి పిచ్చి పోస్టర్లు అంటిస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. బట్టకాల్చి మీద వేయడంలో సీఎం కేసీఆర్ దిట్ట అని.. ఆస్కార్, నోబెల్ బహుమతులను ఆయనకు ఇవ్వొచ్చన్నారు. అధికారం తలకెక్కి డబ్బుల అండతో తెలంగాణను ఏమైనా చేస్తామని అహాంకార పూరితంగా విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ వస్తే కనీసం కలవడం కూడా చేతకాక.. చెత్త పోస్టర్లు అంటించారంటూ నిప్పులు చెరిగారు కిషన్ రెడ్డి. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తె టూరిస్ట్ అని ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బయ్యారం స్టీల్ కర్మాగారం పెడతానని ప్రధాని నరేంద్ర మోడీ ఏనాడైనా చెప్పారా? అని ప్రశ్నించిన కిషన్ రెడ్డి.. కేంద్రం ఇవ్వకపోయినా స్టీల్ ఫ్యాక్టరీ తానే పెడతానంటూ కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అనేక కమిటీలు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి ఫీజుబులిటీ లేదని తేల్చి చెప్పాయని వివరించారు.
పూర్తిగా చదవండి..Kishan Reddy: ‘ఆ విషయంలో కేసీఆర్కు ఆస్కార్, నోబెల్ అవార్డ్ ఇవ్వొచ్చు’
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రధాని మోదీ వస్తే.. పిచ్చి పిచ్చి పోస్టర్లు అంటిస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. బట్టకాల్చి మీద వేయడంలో సీఎం కేసీఆర్ దిట్ట అని.. ఆస్కార్, నోబెల్ బహుమతులను ఆయనకు ఇవ్వొచ్చన్నారు.
Translate this News: