ప్రముఖ హీరో విశాల్ నటించిన మార్క్ ఆంటోని సినిమా హిందీ వెర్షన్ విషయంలో లంచం ఇచ్చానంటూ సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (Central Board of Film Certification) పై విశాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సెన్సార్ కోసం దాదాపు రూ. 6.5 లక్షల లంచంగా చెల్లించాల్సి వస్తందని ఆరోపించారు. ఈ విధంగా ముంబై సెన్సార్ బోర్డు కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతుందంటూ విశాల్ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో కేంద్ర సమాచార ప్రసారశాఖ అత్యవసరంగా భేటీ అయ్యింది. ఈ సమావేశం అనంతరం సెన్సార్ బోర్డు కీలక నిర్ణయం తీసుకోవడంతోపాటు విశాల్ చేసిన ఆరోపణలపై కూడా స్పందించింది.
పూర్తిగా చదవండి..CBFC: విశాల్ ఆరోపణతో సెన్సార్ బోర్డ్ సంచలన నిర్ణయం..ఏంటంటే.!!
ప్రముఖ నటుడు విశాల్ చేసిన ఆరోపణపై సెన్సార్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విశాల్ ను లంచం డిమాండ్ చేసింది సెన్సార్ బోర్డులు కాదంటూ ప్రకటించింది. ఆయన నుంచి డబ్బు వసూలు చేసింది థర్డ్ పార్టీ అంటూ వెల్లడించింది. ఈ కేసులో పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సెన్సార్ బోర్డు తెలిపింది.
Translate this News: