స్కిల్ డవలప్మెంట్ కేసుకు (Skill Development Case) సంబంధించి ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే.. వాదనలు వినిపించేందుకు చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తమకు గంట సమయం ఇవ్వాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని సీఐడీ తరఫు న్యాయవాదులు కోరారు. అయితే.. సమయం ఇవ్వడం కుదరదని సీఐడీ తరపు న్యాయవాదులకు ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. పది నిమిషాల్లో ఇరువురు వాదనలు వినిపించాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 10 నిమిషాల బ్రేక్ తరువాత ఏసీబీ కోర్టులో వాదనలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లపై వాదనలు జరుగుతున్నాయి. బెయిల్ పిటిషన్ పై చంద్ర బాబు తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దుబే వాదనలు వినిపిస్తున్నారు.
Chandrababu Naidu Case Updates: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణకు లంచ్ బ్రేక్
చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ విచారణ సందర్భంగా తమకు గంట సమయం ఇవ్వాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని సీఐడీ తరఫు న్యాయవాదులు కోరారు. అయితే.. సమయం ఇవ్వడం కుదరదని సీఐడీ తరపు న్యాయవాదులకు ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. పది నిమిషాల్లో ఇరువురు వాదనలు వినిపించాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Translate this News: