తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు (CM KCR) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో బీసీ కుల గణన చేపట్టాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. బీసీ కుల గణన చేపట్టాలని సుదీర్ఘ కాలంగా డిమాండ్ ఉందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. బీసీ జనగణన డిమాండ్ కు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించిందన్నారు. ఈ విషయంలో బీసీ సంఘాలు చేపట్టిన ప్రతీ నిరసన, ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందన్నారు రేవంత్ రెడ్డి. మహిళా బిల్లును పార్లమెంటులో ఆమోదించిన సమయంలో కూడా తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా బీహార్ రాష్ట్రంలో బీసీ జనగణనను విజయవంతంగా చేపట్టిందని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేశారు. బీసీ కుల గణనతోనే బీసీ వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు రేవంత్.
ఇది కూడా చదవండి: Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికలు వాయిదా?
Revanth Reddy: తెలంగాణలో బీసీ కుల గణన.. సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ.. వివరాలివే!
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని ఆయన కోరారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందన్నారు రేవంత్.
Translate this News: