ఆసియా క్రీడల్లో భాగంగా నేపాల్ తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ లో టీమిండియా దుమ్మురేపింది. యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు సాధించింది. యశస్వి జైస్వాల్ (49 బంతుల్లో 100 పరుగులు ; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. క్రీజులో ఉన్నంతసేపు యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడాడు. మిగతా బ్యాటర్లు తడబడ్డారు. రుతురాజ్ గైక్వాడ్ (23 బంతుల్లో 25 పరుగులు) రాణించాడు. ఆఖర్లో శివమ్ దూబే, రింకూ సింగ్ మెరుపులు మెరిపించడంతో టీమిండియా మంచి స్కోరు సాధించింది. రింకూ సింగ్( 15 బంతుల్లో 37పరుగులు నాటౌట్) అదరగొట్టాడు. నేపాల్ బౌలర్లలో దీపేంద్రసింగ్ ఐరీ రెండు వికెట్లతో సత్తా చాటాడు. సందీప్ లామిచానే, సోమపాల్ చెరో వికెట్ తీశారు.
పూర్తిగా చదవండి..asian games:చితక్కొట్టిన యశస్వి జైశ్వాల్…22 బంతుల్లో హాఫ్ సెంచరీ
ఆసియా క్రీడల్లో మొదటి క్వార్టర్ ఫైనల్స్ లో భారత జట్టు నేపాల్ మీద అదరగొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సెంచరీతో చెలరేగిపోయాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు.
Translate this News: