Pradhan Mantri Mudra Yojana Scheme: నేటికాలంలో చాలా మంది యువత ఉద్యోగాలు చేస్తూనే అదనపు ఆదాయం కోసం చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఇంకొంతమంది ఉద్యోగాలు మానేసి సొంతంగా వ్యాపారం చేస్తున్నారు. మరికొంతమంది ఉన్న వ్యాపారాన్ని మరింత విస్తరిస్తున్నారు. అయితే వీటన్నింటికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. అందుకే చాలా మంది బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటారు. అందుకోసం ఎన్నోరకాల పత్రాలను బ్యాంకులకు సమర్పించాల్సి ఉంటుంది. లోన్ ఇవ్వాలంటే ఏదొక గ్యారెంటీ బ్యాంకుకు చూపించాల్సిందే. కొన్ని సందర్భాల్లో ఆస్తులను కూడా తాకట్టు పెట్టాల్సి వస్తుంది. అయితే ఇలాంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం కల్పించేందుకు సొంతంగా వ్యాపారం చేసుకునేవారిని ప్రోత్సహించేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ ముద్రా యోజనా పథకాన్ని (Mudra Yojana Scheme) అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా ఎలాంటి హామీ లేకుండానే రూ. 10లక్షల వరకు రుణాన్ని తీసుకోవచ్చు.’
పూర్తిగా చదవండి..Central Govt Scheme: ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ.10 లక్షల లోన్.. మోదీ సర్కార్ అదిరిపోయే స్కీమ్..!!
ఉద్యోగం చేసి బోర్ కొట్టిందా? సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? లేదంటే ఇప్పటికే చేస్తున్న వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ ఒక అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఎలాంటి హామీ లేకుండానే రూ. 10లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. ఆ పథకమేంటీ?ఎలా దరఖాస్తు చేసుకోవాలి? పూర్తి విషయాలను తెలుసుకుందాం.
Translate this News: