టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని (Chandrababu Naidu) ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరో వైపు నారా లోకేష్ (Nara Lokesh) కూడా అరెస్ట్ అవుతురాన్న చర్చ జోరుగా సాగుతోంది. చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుంచి లోకేష్ పార్టీ వ్యవహారాలను చూస్తున్నారు. అయితే.. లోకేష్ కూడా అరెస్ట్ అయితే పార్టీ వ్యవహారాలను ఎవరు చూస్తారన్న ప్రశ్న పార్టీ కేడర్ నుంచి వ్యక్తం అవుతోంది. అదే జరిగితే పార్టీ పగ్గాలు నారా బ్రాహ్మణి చేపట్టనున్నట్లు కూడా ప్రచారం సాగింది. అయితే.. చంద్రబాబు మాత్రం పార్టీ పగ్గాలను తనకు అత్యంత విధేయుడు, నమ్మకస్తుడు, పార్టీలో సీనియర్ అయిన యనమల రామకృష్ణుడికే (Yanamala RamaKrishnudu) అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
పూర్తిగా చదవండి..Big Breaking: యనమలకు టీడీపీ పగ్గాలు.. చంద్రబాబు కీలక నిర్ణయం?
ఒక వేళ నారా లోకేష్ అరెస్ట్ జరిగితే.. టీడీపీ పగ్గాలను తనకు అత్యంత విధేయుడు, నమ్మకస్తుడు అయిన యనమల రామకృష్ణుడికే అప్పగించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. చంద్రబాబును నిన్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, మాజీ మంత్రి నారాయణ కలిశారు. ఆ సమయంలో చంద్రబాబు యనమల పేరును సూచించినట్లు సమాచారం.
Translate this News: