Pawan Kalyan Varahi Yatra: వాయిదా పడిన జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మరోసారి ప్రారంభం కానుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కృష్ణా జిల్లాలో వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుంది. అవనిగడ్డలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ సభతో ఈ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డలోని శ్రీ యక్కటి దివాకర్ వీణాదేవి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో బహిరంగ సభ జరగనుంది. సభా నిర్వహణకు ఏర్పాట్లను జనసేన నాయకులు ప్రారంభించారు. వారాహి వాహనంపై నుంచి సభికుల్ని ఉద్దేశించిపవన్ కల్యాణ్ ప్రసంగిస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో మూడు దశలుగా పూర్తయిన వారాహి విజయ యాత్ర 4వ దశగా కృష్ణా జిల్లాలో 5 రోజులపాటు కొనసాగనుందని తెలిపారు. అవనిగడ్డలో బహిరంగ సభ అనంతరం.. మచిలీపట్నం చేరుకుని 2, 3 తేదీల్లో పవన్ కల్యాణ్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని జనసేన నేతలు తెలిపారు. 2వ తేదీన కృష్ణా జిల్లా జనసేన నాయకులతో సమావేశం అవుతారు. ఆ మరుసటి రోజు అంటే 3వ తేదీన జనవాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరిస్తారు. 4వ తేదీన పెడన, 5వ తేదీన కైకలూరు నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ పర్యటిస్తారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: అక్టోబర్ 1 నుంచి 4వ విడత వారాహి యాత్ర
వాయిదా పడిన జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మరోసారి ప్రారంభం కానుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కృష్ణా జిల్లాలో వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుంది. అవనిగడ్డలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ సభతో ఈ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
Translate this News: