వన్డే వరల్డ్ కప్ సందడి హైదరాబాద్ కి కూడా వచ్చేసింది. ఒకపక్క గణేష్ నిమజ్జనం, మరో వైపు పాక్, న్యూజిలాండ్ క్రికెటర్లతో హైదరాబాద్ హడావుడిగా మారిపోయింది. ఏడేళ్ళ తర్వాత ఇండియాకు వచ్చిన పాక్ క్రికెటర్లకు ఇక్కడ ఘన స్వాగతం లబించింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భద్రతా సిబ్బంది, ప్రయాణికులు జట్టుకు చేతులూపుతూ స్వాగతం పలికారు. స్థానికులు కొంతమంది పాక్ క్రికెటర్లను చూడ్డానికి ఎయిర్ పోర్ట్ కి కూడా వచ్చారు. బాబర్ ఆజమ్ అంటూ నినాదాలు చేశారు.
పూర్తిగా చదవండి..world cup: హైదరాబాద్ లో పాక్ క్రికెటర్ల సందడి…కట్టుదిట్టమైన భద్రత
ఏడేళ్ళ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత్ లోకి అడుగు పెట్టింది. వరల్డ్ కప్ టోర్నీలో ఆడేందుకు వచ్చిన పాక్ క్రికెటర్లు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈరోజు వీరు న్యూజిలాండ్ తో మొదటి వార్మప్ మ్యాచ్ ఆడనున్నారు.
Translate this News: