భారత ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 2వేలకు పైగా పీవో పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల దరఖాస్తు సెప్టెంబర్ 7తో ప్రారంభం కాగా… సెప్టెంబర్ 27తో ముగియాల్సి ఉంది.. ఈ నేపథ్యంలో కీలక అప్ డేట్ ఇచ్చింది ఈ ఎస్బీఐ. పీవో పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది. అక్టోబర్ 3 వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్ రాతపరీక్షకు, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపికలు జరుగుతాయి. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొంది.
పూర్తిగా చదవండి..Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 2 వేల జాబ్స్ పై కీలక అప్డేట్..!!
ఎస్బిఐలో పీవో పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది. సెప్టెంబర్ 27తో ఆన్ లైన్ దరఖాస్తుల గడువు ముగియనుండగా...అక్టోబర్ 3 వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రిజర్వేషన్ ప్రకారం వయో సడలింపు కూడా ఉంటుంది. నవంబర్ లో ప్రిలిమ్స్, డిసెంబర్ లేదా 2024 జనవరిలో మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తారు.
Translate this News: