అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వలసలు జోరుగా సాగుతున్నాయి. ఆయా పార్టీల్లో టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు ఇతర పార్టీల్లోకి చేరుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు పెరిగింది. బీఆర్ఎస్ లో టికెట్ దగ్గని ప్రధాన నేతలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. అలాంటి నేతలను గుర్తించి వారి ఇంటికి వెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు హస్తం పార్టీ ముఖ్య నేతలు. తుమ్మల నాగేశ్వరరావు, కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేరికలే ఇందుకు నిదర్శనం. తాజాగా బీజేపీ నుంచి హస్తం గూటికి చాలా మంది నేతలు రానున్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి ఇంట్లో ఆ పార్టీ అసంతృప్త నేతలు మూడోసారి భేటీ కావడం కమలం పార్టీలో కలకలం సృష్టిస్తోంది.
పూర్తిగా చదవండి..Telangana Political Updates: తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. హస్తం పార్టీలోకి ఆ ఐదుగురు కీలక నేతలు?
బీజేపీకి చెందిన మాజీ ఎంపీలు విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఒక వేళ వారు పార్టీ వీడితే కాంగ్రెస్ పార్టీలోనే చేరుతారని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది.
Translate this News: