దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పుడు దేశం గొప్పగా పొంగిపోతుంది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశాన్ని నడిపిస్తున్న నాయకుల వల్లే దేశానికి స్వాతంత్య్రం సాధ్యమయ్యిందని నినదిస్తుంది. స్వాతంత్య్రం నుంచి గణతంత్ర్యం వరకు ఇదే తీరు ప్రతి చోటా కనిపిస్తుంది. కానీ భారతదేశ స్వేచ్చ పోరాటాలు ముందుకు సాగేందుకు ఎంతో మంతి ప్రాణాలు కోల్పోయారు. వారి ప్రాణత్యాగ ఫలితమే ఈ స్వాతంత్య్ర భారతం. అటువంటి వారిలో భగత్ సింగ్ మొదటి వరుసలో ఉంటారు. చిన్న వయస్సులోనే దేశం కోసం ప్రాణాలు విడిచిని భగత్ సింగ్ చివరి క్షణాల గురించి ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది.
పూర్తిగా చదవండి..Bhagat Singh Jayanti : భగత్ సింగ్ ఆఖరి మాటలు వింటే గూస్బంప్స్ గ్యారెంటీ..!!
యువకుల గుండె చప్పుడు అయిన షహీద్-ఎ-ఆజం భగత్ సింగ్ హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, పంజాబీ, సంస్కృతం, బెంగాలీ, ఐరిష్ భాషలలో బాగా ప్రావీణ్యం సంపాదించాడు. అతను అద్భుతమైన వక్త. భారతదేశంలో సోషలిజంపై మొదటి లెక్చరర్. అతను రెండు వార్తాపత్రికలకు కూడా సంపాదకత్వం వహించాడు. భగత్ సింగ్ 28 సెప్టెంబర్ 1907న లియాల్పూర్ జిల్లాలోని బంగాలో జన్మించాడు. ప్రస్తుతం ఈ ప్రదేశం పాకిస్థాన్లో ఉంది. అతిచిన్న వయస్సులోనే దేశం కోసం ప్రాణాలు విడిచిన భగత్ సింగ్ చివరి క్షణాల గురించి వింటే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగిపోతుంది. భారతీయులలో ఉత్తేజం కలుగుతుంది. నేడు ఆ మహానీయుడి జయంతి.
Translate this News: