భారత ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 2వేలకు పైగా పీవో పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల దరఖాస్తు నేటితో అంటే సెప్టెంబర్ 27తో ముగుస్తుంది. ఈ దరఖాస్తులు సెప్టెంబర్ 7తో ప్రారంభమయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్ రాతపరీక్షకు, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపికలు జరుగుతాయి. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొంది.
పూర్తిగా చదవండి..SBI PO Recruitment 2023: స్టేట్ బ్యాంక్ లో 2000 ఆఫీసర్ జాబ్స్.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్..!!
భారతప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు నేటితో దరఖాస్తు గడువు ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకుని అభ్యర్థులు చివరిక్షణం వరకు వేచి ఉండకుండా వెంటనే అప్లయ్ చేసుకోవడం మంచిది. చివరి క్షణం వరకు వేచి ఉండే అభ్యర్థులు...ఇంటర్నేట్ లేదా మరేదైనా టెక్నికల్ ఇష్యూతో దరఖాస్తు నిలిచిపోయే అవకాశం ఉంటుంది.
Translate this News: