Telangana Cabinet: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 29న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయింది. ఎన్నికల నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించనుందని తెలుస్తోంది. అలాగే గవర్నర్ కోటా కింద ప్రభుత్వం సిఫార్సు చేసిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తమిళిసై తిరస్కరించిన నేపథ్యంలో దానిపై ప్రధానంనగా చర్చించే అవకాశముంది. గవర్నర్ నిర్ణయంపై న్యాయ పోరాటం చేయాలా..? లేదా ఇతరులను నామినేట్ చేయాలా..? అనే దానిపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపైనా చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోపైనా చర్చించినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
పూర్తిగా చదవండి..Telangana Cabinet: ఈనెల 29న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 29న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయింది. ఎన్నికల నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించనుందని తెలుస్తోంది.
Translate this News: