పాక్ బృందానికి వరల్డ్ కప్ లో ఆడటానికి భారత్ ఎంట్రీ ఇచ్చింది. లాస్ట్ మినిట్ వరకూ వీసాలు రాక ఏం చేయాలో తెలిక తికమక పడుతున్న పాక్ ఆటగాళ్ళు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నారు. మరో పది రోజుల్లో క్రికెట్ వన్డే వరల్డ్ కప్ మొదలవబోతోంది. భారత్ వేదిక గా జరుగుతున్న ఈ ప్రపంచకప్ కోసం ఇప్పటికే అన్ని దేవాలు భారత్ కు చేరుకుంటున్నాయి. పాక్ కూడా మరో 48 గంట్లోల ఇండియా రానుంది. కానీ సోయవారం సాయంత్రం వరకూ పాక్ ఆటగాళ్ళకు వీసాలు రాలదు. మరో 48 గంటల్లో భారతదేశానికి బయల్దేరాల్సి ఉండగా ఇంకా వీసాలు రాకపోవడంత మీద పాక్ బోర్డు అసంతృప్తి వెల్లడించింది. సోమవారం ఉదయం ఈ విషయం మీద పాక్ బోర్డు ఐసీసీకి లేఖ రాసింది. చివరకు సాయంత్రానికి అన్నీ సర్దుకున్నాయి. పాకిస్తాన్ టీమ్ భారత్ రావడానికి వీసాలు మంజూరు అయ్యాయని ఐసీసీ నిర్ధారించింది.
పూర్తిగా చదవండి..cricket:హమ్మయ్య మొత్తానికి వీసా వచ్చేసింది
వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఆడుతోంది. ఎట్టకేలకు ఈ దేశానికి వీసా వచ్చింది. జట్టు సభ్యులు, సహాయక సిబ్బందికి ఇండియన్ వీసాలు మంజూరైనట్లు ఐసీసీ ప్రకటించింది. సోమవారం సాయంత్రం వరకూ టెన్షన్ పడుతున్న పాక్ ఆటగాళ్ళు దీంతో ఊపిరి పీల్చుకున్నారు.
Translate this News: