KTR: లోక్సభ నియోజకవర్గాల్ని పునర్విభజించే(డీలిమిటేషన్) అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి కేంద్రం తీసుకోవాలని కోరారు. ఇండియా టుడే గ్రూప్ విడుదల చేసిన డీలిమిటేషన్ లెక్కల జాబితాను షేర్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. దక్షిణ భారతంలో లోక్సభ సీట్లు తగ్గితే బలమైన ప్రజా ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. దక్షిణ రాష్ట్రాలు దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిస్తున్నాయన్నారు. పార్లమెంట్ అనేది దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అని, ఇందులో దక్షిణాది రాష్ట్రాల గొంతును అణచివేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. డీలిమిటేషన్ విషయంపై కేంద్రం మరోసారి పునరాలోచించాలని కేటీఆర్ పేర్కొన్నారు. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, హరియాణా, గుజరాత్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో లోక్ సభ సీట్లు పెరుగుతాయని.. దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుతాయి అని ఆ ఇండియా టుడే నివేదికలో పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..KTR: దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరిక
లోక్సభ నియోజకవర్గాల్ని పునర్విభజించే(డీలిమిటేషన్) అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి కేంద్రం తీసుకోవాలని కోరారు. ఇండియా టుడే గ్రూప్ విడుదల చేసిన డీలిమిటేషన్ లెక్కల జాబితాను షేర్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు.
Translate this News: