Aiadmk: సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలలు ముందు తమిళనాడులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో పొత్తును తెగతెంపులు చేసుకున్నట్లు అన్నాడీఎంకే సంచలన నిర్ణయం ప్రకటించింది. చెన్నైలో జరిగిన అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మునుస్వామి మాట్లాడుతూ ఎన్డీయే కూటమితో బంధాన్ని తెంచుకున్నట్లు తెలిపారు. అన్నాడీఎంకే మాజీ నేతలతో పాటు తమ ప్రధాన కార్యదర్శి పళనిస్వామిపై ఏడాదిగా బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. అందుకే ఆ పార్టీతో సంబంధాలు తెంచుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ఈ ప్రకటన అనంతరం ఆ పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
పూర్తిగా చదవండి..Aiadmk: తమిళనాడులో కీలక పరిణామం.. ఎన్డీఏతో పొత్తుకు అన్నాడీఎంకే గుడ్ బై
సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలలు ముందు తమిళనాడులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో పొత్తును తెగతెంపులు చేసుకున్నట్లు అన్నాడీఎంకే సంచలన నిర్ణయం ప్రకటించింది. చెన్నైలో జరిగిన అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
Translate this News: