BRS Focus on Malkajgiri: ఎట్టకేలకు ఊగిసలాటకు తెరపడింది.. ముందునుంచీ అనుకుంటున్నట్లుగానే ఆయన పార్టీని వీడారు.. తన రాజీనామా లేఖను గులాబీ బాస్కు పంపించారు. ఆయనెవరో కాదు.. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. తన కొడుక్కి ఎమ్మెల్యే సీటు కోసం బీఆర్ఎస్ను వీడిన ఆయన.. రేపో మాపో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇదంతా ఇలా ఉంటే.. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనేదే ఆసక్తికరంగా మారింది. పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్లో మల్కాజిగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మైనంపల్లి హనుమంతరావు పేరును ఖరారు చేశారు. అయితే, తన కొడుక్కి మెదక్ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలంటూ ఆయన కోరగా.. అధినేత అంగీకరించలేదు. దాంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న మైనంపల్లి.. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు.
పూర్తిగా చదవండి..Telangana Elections: మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థిపై ఉత్కంఠ.. పోటీలో నిలిచేది ఆయనేనా?
తన కొడుక్కి ఎమ్మెల్యే సీటు కోసం బీఆర్ఎస్ను వీడిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.. రేపో మాపో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ రాజీనామా నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనేదే ఆసక్తికరంగా మారింది.
Translate this News: