చంద్రుని మీద పరిశోధనల ఇస్రో చేసిన ప్రయోగం చంద్రయాన్-3 సక్సెస్ అయింది. అయితే చంద్రుని మీద లూనార్ నైట్ ప్రారంభం అవడం వల్ల ఇస్రో విక్రమ్, ప్రజ్ఞాన్ లను ఈ నెల 2, 4 తేదీల్లో నిద్రాణ స్థితిలోకి పంపింది. ఈరోజుతో లూనార్ నైట్ ముగిసి మళ్ళీ చంద్రుని మీద పగలు మొదలవుతుంది. దీని ప్రకారం స్లీప్ మోడ్ లో ఉన్న విక్రమ్ , ప్రజ్ఞాన్ లు మళ్ళీ యాక్టివ్ అవ్వాలి. వీటిని క్రియాశీలకంగా మార్చేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాటి నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ మాత్రం ఇప్పటివరకూ రాలేదు. అయితే ఈ ప్రయత్నాలను ఇప్పటితో వదిలేయడం లేదని మరిన్ని జరుగుతాయని చెబుతోంది ఇస్రో.
పూర్తిగా చదవండి..chandrayan-3:ఇప్పటివరకూ ఎలాంటి సందేశాలు లేవు-ఇస్రో
చంద్రుని మీద ఉన్న మన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు గత కొన్ని రోజులుగా నిద్రాణ స్థితిలో ఉన్నాయి. లెక్క ప్రకారం అయితే ఈ రోజు నుంచి అవి మళ్ళీ తిరిగి పని చేయాలి కానీ ఇప్పటి వరకూ వాటి నుంచి ఎటువంటి సందేశాలు అందలేదని ఇస్రో తెలిపింది.
Translate this News: