కేంద్రంలో అనూహ్యమైన పొత్తు కుదిరింది. ఎన్డీయే కూటమిలో జేడీఎస్ చేరింది. దీంతో ఎన్నికల సమీపిస్తున్న సమయంలో రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకున్నట్టు అయింది. కర్ణాటకకు చెందిన జేడీఎస్ పార్టీ బీజెపీ సార్ధ్యంలో ఎన్డీయే కూటమిలో అధికారికంగా చేరింది. బీజెపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశమైన జేడీఎస్ నేత కర్ణాటక మాజీ సీఎంకుమారస్వామి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ ఇరు పార్టీలు పొత్తు చేసుకుంటాయని ఎప్పటి నుంచో ఊహాగానాలు సాగుతున్నాయి. వాటికి ఈరోజుతో తెరపడినట్లయింది. మరోవైపు జేడీఎస్ పార్టీ ఎన్డీయేలో చేరడంతో బీఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలినట్లయింది. జేడీఎస్ తమతో కలుస్తుందని కేసీఆర్ చాలా రోజుల నుంచి చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..ఎన్డీయే కూటమిలో చేరిన జేడీఎస్
జేడీఎస్ పార్టీ ఎన్డీయే కూటమిలో జాయిన్ అవుతున్నట్టు ప్రకటించింది. ఆ పార్టీ అధినేత కుమార స్వామి అమిత్ షా తో భేటీ అయ్యారు. అమిత్ షా ఆయనకు శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలినట్టు అయింది. మొన్నటివరకూ జేడీఎస్ తమతో కలుస్తుందని గులాబీ పార్టీ అనుకుంటూ వచ్చింది.
Translate this News: