చైనాలో హంగజౌ లో 19వ ఆసియా క్రీడలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అరుణాచల్ ప్రదేశ్ క్రీడాకారుల పట్ల చైనా వివక్ష చూపించింది. వారి వీసాలను, అక్రిడేషన్ ను నిరాకరించింది. దీని భారత్ స్పందించింది. క్రీడాకారులను అడ్డుకునేలా చైనా ఉద్దేశపూర్వకంగానే ఈపని చేసిందని నిరసన తెలియజేసింది. అరుణాచల్ ప్రదేశ్ కూడా భారత్ లో అంతర్భాగమేనని…భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినధి అరిందమ్ బాగ్చీ స్పష్టం చేశారు. ఇలా అడ్డుకోవడం క్రీడా స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తన చైనా పర్యటనను రద్దు చేసుకున్నట్లు భారత విదేశాంగ మంత్రి ప్రకటించింది.
పూర్తిగా చదవండి..అరుణాచల్ ప్రదేశ్ అథ్లెట్లకు వీసా నిరాకరించిన చైనా
చైనా తన వంకర బుద్ధిని మరోసారి బయట పెట్టుకుంది. భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన అథ్లెట్లకు వీసాలను, అక్రిడేషన్ లను నిరాకరించింది. ఈ విషయం మీద భారత్ మండిపడుతోంది.
Translate this News: