ఉగ్రవాదంతో సంబంధం ఉన్న వ్యక్తులతో ఇంటర్వ్యూలు చేయడం మానుకోవలని కేంద్రం ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్స్ కు హెచ్చరికలు జారీచేసింది. సిక్కు వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన బహిరంగ ఆరోపణలపై ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఈ నేపథ్యంలో ఈ అడ్వైజరీ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్, కెనడాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వేర్పాటు వాద నేత, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్ను ఒక టెలివిజన్ ఛానెల్లో ప్రత్యక్షమయ్యాడు. అయితే కేంద్రం జారీ చేసిన అడ్వైజరీలో పన్నూ, కెనడా పేర్లను ప్రస్తావించలేదు కేంద్రం.
పూర్తిగా చదవండి..ఉగ్రవాదులతో డిబెట్లా? కెనడాతో ఉద్రిక్తతల వేళ టీవీ ఛానళ్లకు కేంద్రం హెచ్చరిక..!!
కెనడా భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ దేశంలోని ప్రైవేట్ టీవీ ఛానెళ్లకు కేంద్ర సర్కార్ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఉగ్రవాదంతో సంబంధం ఉన్న వ్యక్తులను ఇంటర్య్వూలు చేయడం మానుకోవాలంటూ ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్స్ కు సలహా ఇచ్చింది కేంద్రం.
Translate this News: