ఖలిస్తాన్ నాయకుడు హర్ దీప్ సింగ్ నిజ్జర్ తో భారత ఏజెంట్లకు సంబంధముందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ఆరోపణలు చేయడంతో భారత్, కెనడా దేశాల మధ్య చిచ్చు రాజుకుంది. ఇరు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించారు. ప్రపంచ దేశాలు ఈ ఇష్యూ మీద ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. ఒక్క పాకిస్తాన్ తప్ప మిగతా దేశాలన్నీ భారత్ కే మద్దతు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా-కెనడాల మధ్య వీసా ఆపరేషన్స్ ను నిలిపేస్తున్నామని భారత ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం కెనడియన్ పౌరులకు భారత వీసాలను మంజూరు చేయరు. తదుపరి నోటీసులు వచ్చేవకు వీసాలను ఇవ్వమని చెబుతోంది. భారతదేశం ఇంకా ఇతర దేశాల నుండి దరఖాస్తులను నిర్వహించే BLS ఇంటర్నేషనల్ ఆన్లైన్ వీసా దరఖాస్తు కేంద్రం వెబ్ సైటులో ఈ సందేశాన్ని పోస్ట్ చేసింది. 21 సెప్టెంబర్ 2023 నుండి ఈ నోటీసు అమలులోకి వస్తుందని తెలిపింది. మళ్ళీ ఎప్పుడు దరఖాస్తును స్వీకరించేది తెలియాలంటే BLS వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి అని తెలిపింది. అయితే వీసాల సస్పెన్షన్కు భారత్-కెనడా ఘర్షణకు లింక్ ఉందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
పూర్తిగా చదవండి..canada issue:కెనడియన్లకు భారతీయ వీసాలు నిలిపివేత…
కెనడా-భారత్ ల మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోందే తప్ప ఎక్కడా తగ్గే సూచనలు కనిపించడం లేదు. తాజాగా భారత్-కెనడా దేశాల మధ్య వీసా ఆపరేషన్స్ ను నిలిపేస్తున్నామని భారత్ ప్రకటించింది.
Translate this News: