PM Modi invites US President Biden: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతితిగా రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్(Joe Biden)ను ఆహ్వానించారు భారత ప్రదాని నరేంద్ర మోదీ(PM Modi). ఈ విషయాన్ని భారత్లోని అమెరికా(America) రాయబారి ఎరిక్ గార్సెట్టీ వెల్లడించారు. జి20లో భాగంగా ద్వైపాక్షిక సమావేశంలో మాట్లాడిన భారత్లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ.. జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ను ఆహ్వానించినట్లు తెలిపారు. అయితే, గణతంత్ర దినోత్సవ వేడుకలకు క్వాడ్ దేశాల నేతలను ఆహ్వానించడాన్ని భారత్ పరిశీలిస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. అమెరికాకు ఆహ్వానం అందిందా? అంటూ మీడియా ప్రతినిథులు అమెరికా రాయబారిని ప్రశ్నించారు. దీనికి స్పందించిన గార్సెట్టీ.. జీ20 సదస్సు సందర్భంగా జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో అమెరికా అధ్యక్షుడు బిడెన్ను ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించారని తెలిపారు. ఇటీవల ముగిసిన G20 సమ్మిట్లో ఇరువురు నేతల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల నేపథ్యంలో ప్రధాని మోదీ బిడెన్కు ఆహ్వానం పంపినట్లు గార్సెట్టి పేర్కొన్నారు. కాగా, భారతదేశం – యుఎస్ ఏడవ, చివరి అత్యుత్తమ ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) వివాదాన్ని కూడా పరిష్కరించడం జరిగిందని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా, ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో గతంలో ఉన్న ఆరు వివాదాలు పరిష్కరించడం జరిగిందన్నారు.
పూర్తిగా చదవండి..Modi invites Biden: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా జో బిడెన్.. ఆహ్వానించిన ప్రధాని మోదీ..
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతితిగా రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ను ఆహ్వానించారు భారత ప్రదాని నరేంద్ర మోదీ. ఈ విషయాన్ని భారత్లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ వెల్లడించారు.
Translate this News: