Narendra Modi: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సక్రమంగా జరగలేదని ప్రధాని మోదీ మరోసారి పునర్ధాఘటించారు. పార్లమెంట్ ప్రత్యేక భవానికి వీడ్కోలు కార్యక్రమం సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటు ఈ పార్లమెంట్ భవనంలోనే జరిగిందని.. కానీ ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లా ఆంధ్ర, తెలంగాణ విభజన జరగలేదని తెలిపారు. దివంగత ప్రధాని వాజ్పేయీ హయాంలో మూడు రాష్ట్రాల విభజన ప్రణాళికాబద్ధంగా జరిగిందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ మూడు రాష్ట్రాల విభజన అన్ని వర్గాలను సంతృప్తిపరిచిందని, అన్ని చోట్లా సంబరాలు కూడా జరిగాయని వ్యాఖ్యానించారు. కానీ ఏపీ విభజన మాత్రం ఎంతో ప్రయాసతో జరిగిందన్నారు. అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ వర్గాలను సంతృప్తిపర్చలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రం వచ్చినా తెలంగాణ సంబరాలు చేసుకోలేకపోయిందని మోదీ వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Narendra Modi: ఏపీ విభజనపై పార్లమెంట్లో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సక్రమంగా జరగలేదని ప్రధాని మోదీ మరోసారి పునర్ధాఘటించారు. పార్లమెంట్ ప్రత్యేక భవానికి వీడ్కోలు కార్యక్రమం సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటు ఈ పార్లమెంట్ భవనంలోనే జరిగిందని.. కానీ ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లా ఆంధ్ర, తెలంగాణ విభజన జరగలేదని తెలిపారు.
Translate this News: