యూజీన్ (UNG)వేదికగా జరుగుతున్న డైమండ్ లీగ్ ఫైనల్లో (Diamond League Final) భారత జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా టైటిల్ను కాపాడుకోలేకపోయాడు. ఈ పోటీలో చెక్ రిపబ్లిక్కు చెందిన జాకుబ్ వాడ్లెచ్ 84.24 మీటర్ల బెస్ట్ త్రోతో ఛాంపియన్గా నిలిచాడు. ఆఖరి మ్యాచ్లో నీరజ్ చోప్రాకు శుభారంభం లేకపోవడంతో అతని తొలి త్రో ఫౌల్ అయ్యింది. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 83.80 మీటర్లతో రెండో స్థానంలో నిలిచాడు. మూడో ప్రయత్నంలో జావెలిన్ను 81.37 మీటర్ల దూరం మాత్రమే విసిరి నాలుగో ప్రయత్నంలో మళ్లీ ఫౌల్కి పాల్పడ్డాడు. దీని తర్వాత, భారత స్టార్ ఐదో ప్రయత్నంలో 80.74 మీటర్ల దూరంలో ఉండగా… ఆరో ప్రయత్నంలో 80.90 మీటర్ల దూరాన్ని మాత్రమే అధిగమించగలిగారు.
పూర్తిగా చదవండి..Diamond League Final: డైమండ్ లీగ్లో రెండో స్థానంతో సరిపెట్టుకున్న నీరజ్ చోప్రా..!!
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ 2023 ఫైనల్లో తన టైటిల్ను కాపాడుకోలేకపోయాడు. గతేడాది నీరజ్ ఛాంపియన్గా నిలవగా, ఈసారి రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Translate this News: