ఈ ఏడాది హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానాలలో బీభత్సం సృష్టించిన వర్షాలు ఇప్పుడు మధ్య భారతదేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా మధ్యప్రదేశ్లో నర్మదా నది ఉప్పొంగుతోంది. గుజరాత్లోనూ సర్దార్ సరోవర్ నర్మదా డ్యామ్పై పలు గేట్లు తెరిచారు. నర్మదా, భరూచ్, వడోదరలోని పలు గ్రామాల్లో అలర్ట్ ప్రకటించారు. మరోవైపు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈసారి వర్షాల ప్రభావం మధ్యప్రదేశ్లో ఎక్కువగా కనిపిస్తోంది, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్ని శాఖలను అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
పూర్తిగా చదవండి..IMD Rain Alert : ఈ రాష్ట్రాల్లో మెరుపులతో కూడిన భారీ వర్షం..అప్రమత్తంగా ఉండాలంటూ IMD హెచ్చరిక..!!
గతకొన్నాళ్లుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాపాతం నమోదు అయ్యింది. ఈనేపథ్యంలో రానున్న రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని ఐఏండీ తెలిపింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్ , మహారాష్ట్ర తోపాటు తెలంగాణలోనూ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రెండు మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది.
Translate this News: