Chandrababu Naidu Arrest: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ను సైకో అంటూ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. చంద్రబాబుపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకున్నప్పటికీ.. చంద్రబాబును జైల్లో వేశారన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్న నారా లోకేష్.. జాతీయ స్థాయి నేతలతో భేటీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు లోకేష్. చంద్రబాబుతో పవన్ ములాఖత్పై సీఎం జగన్ చేసిన కామెంట్స్పై తీవ్రంగా స్పందించారు. సైకో జగన్ను గద్దే దింపే వరకు ఊరుకునేదే లేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా.. జైల్లో వేసినా.. పోరాటం ఆగదని స్పష్టం చేశారు నారా లోకేష్. తాను స్టాన్పోర్డ్లో ఎంబీఏ చేశానని.. సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన లోకేష్.. కేసులు పెడితేనో.. జైల్లో వేస్తేనో భయపడే వాళ్లం అస్సలు కాదన్నారు. రాష్ట్రంలో ప్రజలను వేధిస్తున్న సైకో జగన్ను శాశ్వతంగా ఇంటికి పంపించే లక్ష్యంతో తాము పని చేస్తామని చెప్పారు లోకేష్.
పూర్తిగా చదవండి..Chandrababu Arrest: సైకో జగన్ను శాశ్వతంగా ఇంటికి పంపిస్తాం.. నారా లోకేష్ సంచలన కామెంట్స్..
స్టాన్పోర్డ్లో ఎంబీఏ చేశానని.. సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన లోకేష్.. కేసులు పెడితేనో.. జైల్లో వేస్తేనో భయపడే వాళ్లం అస్సలు కాదన్నారు. రాష్ట్రంలో ప్రజలను వేధిస్తున్న సైకో జగన్ను శాశ్వతంగా ఇంటికి పంపించే లక్ష్యంతో తాము పని చేస్తామని చెప్పారు లోకేష్.
Translate this News: