పాక్ ఆక్రమిత కాశ్మీరులో ఉగ్రవాదులకు ఐఎస్ఐ అత్యంత అధునాతన ఆయుధాలను సప్లై చేస్తోందని భారత నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నారు. వాటితో పాటూ డిజిటల్ మ్యాప్ లు, నేవిగేషన్ వ్యవస్థలను కూడా ఇస్తోందని తెలిపారు. భారత్ లోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని నిఘా వర్గాలు ఇంతకు ముందు నుంచే హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో భారత భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు ముష్కరుల ప్రయత్నాలను భగ్నం చేస్తూనే ఉన్నాయి కూడా. రీసెంట్ గా ఓ లష్కరే తోయిబా ఉగ్రవాది గుర్తు తెలియని దుండగుల చేతిలో మరణించాడు. దీనికి ప్రతీకారంగా లష్కరే తోయిబా అనంత్ నాగ్ లో దాడులు జరపగా అందులో ఇద్దరు సైనికాధికారులు, ఓ డీఎస్పీ మృతి చెందారు.
పూర్తిగా చదవండి..పాక్ ఉగ్రవాదులకు చైనా ఆయుధాలను అందిస్తున్న ఐఎస్ఐ
భారత్ లో అల్లర్లు చేయడానికి పక్క దేశం పాకిస్తాన్ ఎప్పుడూ ఎదురు చూస్తుంటుంది. ఉగ్రవాదులను తయారు చేసి,వాళ్ళను ఇండియాలోకి పంపించి...విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. మరోసారి పాక్ ఇలాంటి చర్యలకు పాల్పడడానికి చూస్తోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. దీని కోసం ఐఎస్ఐ పాక్ ఉగ్రవాదులకు అత్యాధునిక చైనా ఆయుధాలను అందిస్తోందని హెచ్చరిస్తున్నారు.
Translate this News: