Tollywood Drugs Case: సినీ పరిశ్రమల్లో మాదక ద్రవ్యాల వినియోగం చాలా మామూలు అయిపోయింది ఇప్పుడు. అది తప్పు, ఇల్లీగల్ అని తెలిసినా కూడా ఎలాగో ఒకలా వాటిని వాడడం, విక్రయాలు చేస్తూనే ఉన్నారు. టాలీవుడ్ లో కూడా ఈ డ్రగ్స్ విషయం చాలా సార్లు కలకలం రేపింది. ప్రముఖ దర్శకుడు, నటులు చాలా మందిని ఈ విషయంలో విచారించడం కూడా జరిగింది. తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో మత్తు పదార్ధాల వినియోగం వ్యవహారం మళ్ళీ తెరమీదకు వచ్చింది. ఇటీవల డ్రగ్స్ కేసులో పట్టుబడిన సినీ ఫైనాన్షియర్ కె. వెంకటరత్నారెడ్డి, కాప భాస్కర్ బాలాజీలను టీఎస్ న్యాబ్ (TSNAB) పోలీసులు విచారించగా….తెలుగు సినీ పరిశ్రమకు, డ్రగ్స్ ముఠాకు ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. సినీ పరిశ్రమలో ఉన్నవారు పలువురికి నైజీరియన్లతో సంబంధాలున్నాయిని…వారిదగ్గర నుంచే డ్రగ్స్ సరఫరా అవుతున్నాయిని తెలిసింది.
పూర్తిగా చదవండి..Tollywood Drugs Case: మత్తెక్కుతోన్న టాలీవుడ్…ఎవరెవరు, ఎలా చేస్తున్నారు?
టాలీవుడ్ లో మరో సారి డ్రగ్స్ కలకలం రేగింది. నైజీరియన్లతో సంబంధాలు పెట్టుకున్న తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురి వ్యవహారం బయటపడింది. దీంట్లో ప్రముఖ నటుడు, హీరో నవదీప్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం నవదీప్, నిర్మాత ఉప్పలపాటి రవి, హైదరాబాద్ లోని స్నార్ట్ పబ్ యజమాని సూర్యతో పాటూ మరికొందరు పరారీలో ఉన్నారు.
Translate this News: