Bandi Sanjay Kumar: తెలంగాణలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు రానున్నాయి. దాంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నిలకపై(Telangana Elections) ఫోకస్ పెట్టాయి. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ(BJP).. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. అధికార బీఆర్ఎస్(BRS) పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్స్ చేస్తోంది. ఇక ఆ పార్టీ ముఖ్య నేతలు సైతం తాము పోటీ చేయాలని భావిస్తున్న నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ స్థానంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..Telangana Elections: ఇక నుంచి నా ఫోకస్ ఆ సీట్పైనే.. బండి సంజయ్ సంచలన కామెంట్స్..
ఎంపీగా ఉన్న బండి సంజయ్.. తదుపరి ఎన్నికల్లో మళ్లీ గెలిచేందుకు అవసరమైన వ్యూహ రచన చేస్తున్నారు. ఇంతకాలం.. ఆయన ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తారని భావించినా.. లేటెస్ట్గా ఆయన చేసిన కామెంట్స్ పోటీపై ఓ క్లారిటీని ఇచ్చాయి. ఇకపై ఆ నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు.
Translate this News: